E-Paper
Advertisement

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!
Advertisement

Adivasi Tourism: స్వేచ్ఛ బ్యూరో: ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది. గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. “మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తాను” అని హామీ ఇచ్చారు. తన ఆలోచనల నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమానికి ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ పేరుతో కార్యరూపం దాల్చనుంది.

సుమారు 650 మంది

ఈ నెల 22న (బుధవారం) ఉదయం 6 గంటలకు ఉట్నూరు మండలం గొండు‌గూడలో జెండా ఊపి ఈ విజ్ఞాన యాత్రను మంత్రి స్వయంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలను చూడటమే కాకుండా, ఆదివాసీలు ప్రపంచ పోకడలను, ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వారసత్వాన్ని దగ్గరగా గమనించాలన్నది మంత్రి ప్రధాన సంకల్పం. వారి ఆలోచనల నుంచి పుట్టిన ఈ ప్రత్యేక విజ్ఞాన యాత్రలో ఉట్నూరు ప్రాంతానికి చెందిన సుమారు 650 మంది ఆదివాసీలు పాల్గొంటున్నారు. ఆదివాసీల సంస్కృతికి – నగర నాగరికతకు మధ్య వారధిని నిర్మించాలన్న మంత్రి ఆకాంక్ష ఈ కార్యక్రమం ద్వారా నెరవేరనుంది.

Advertisement

Also Read: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నూనె ధరలు.. అసలు కారణం ఇదే!

యాత్ర సాగనుందిలా..

ఈ విజ్ఞాన యాత్రను మొత్తం మూడు విడతలుగా రూపకల్పన చేశారు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు సాగే ఈ పర్యటనలో ఒక్కో బ్యాచ్‌కు 200 నుంచి 250 మంది చొప్పున మూడు బ్యాచ్‌లుగా హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరి సౌకర్యార్థం మంత్రి ఆదేశాల మేరకు 5 ప్రత్యేక ఏసీ బస్సులను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు.

అతిథి మర్యాదల్లో లోటు లేకుండా..

Advertisement

యాత్రకు వచ్చే అడవి బిడ్డలకు బస, భోజన వసతులలో ఎటువంటి లోటు రాకుండా చూడాలని మంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చారిత్రక కట్టడం తారామతి బరాదరిలో వీరికి బస ఏర్పాటు చేయడంతో పాటు, ఆత్మీయ ఆతిథ్యం అందించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మారుమూల అడవుల నుంచి వచ్చే ఆదివాసీలకు ఈ రెండు రోజుల పర్యటన ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. పర్యాటక శాఖ, ఆదిలాబాద్ కలెక్టర్, ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

ALSO Read: వివాదంలో అంబానీ..ముంబై ఇండియ‌న్స్ కోచ్ గా మహ్మద్ అమీర్ ?

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×