E-Paper
Advertisement

Breaking News: రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారం కవిత ప్రమేయం.. ఈడీ సంచలన ప్రకటన!

Breaking News: రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారం కవిత ప్రమేయం.. ఈడీ సంచలన ప్రకటన!
kavitha delhi liquor case
BRS MLC Kavitha Arrested In Delhi Liquor Scam

Delhi Liquor Scam Latest Update: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ప్రకటించారు. రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారం కవిత ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఆప్ నేతలకు కవిత వంద కోట్లు చెల్లించారని అధికారులు తెలిపారు. లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేశామని.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై, ముంబై సహా 245 చోట్ల సోదాలు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. రూ. 128 కోట్ల ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. ఆప్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో కవితకు సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.

మార్చి 23 వరకు కవిత తమ కస్టడీలో ఉంటారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఆ సమయంలో కవిత బంధువులు తమను అడ్డుకున్నారని చెప్పారు.

ఢిల్లీ మద్యం పాలసీలో రూపకల్పన, అమలులో లబ్ధి పొందేందుకు కవితతో పాటు మరి కొంతమంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో కలిసి కుట్రపన్నారని దర్యాప్తులో వెల్లడైందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×