E-Paper
Advertisement

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్
Advertisement

సంగారెడ్డి, స్వేచ్ఛ: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. అలాగే, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అయితే, ఏకంగా చెరువులోనే 5 అంతస్తుల భవనం కట్టేశారు. గురువారం దీనిని కూల్చివేశారు అధికారులు.

భవనంపైకి వెళ్లేందుకు ప్రత్యేక మెట్ల మార్గం

Advertisement

Also Read: కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు ఇదే ఒక కేస్ స్టడీ: సీఎం రేవంత్

మల్కాపూర్‌కు దగ్గరలో పెద్ద చెరువు ఉంటుంది. దానికి ఆనుకుని 5 అంతస్తుల అక్రమ నిర్మాణం జరిగిందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గ్రామానికి చేరుకుని చెరువులోనే ఉన్న బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. దీనికోసం డిటోనేటర్లను వాడారు. హైదరాబాద్‌కు చెందిన నర్సింహులు ఈ భవనానికి ఓనర్‌గా గుర్తించారు. నీటిలో అడుగు పెట్టకుండా భవనంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గాన్ని నిర్మించారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీరేవారని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

కూల్చివేతలో అపశృతి

చెరువులో బహుళ అంతస్తుల భవనం ఉండడంతో అధికారులు బాంబులు అమర్చి కూల్చివేశారు. ఈ క్రమంలో శిథిలాలు ఎగిరిపడ్డాయి. అవి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

Also Read: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

పట్టా భూమి అంటేనే కొన్నా – భవనం ఓనర్

మల్కాపూర్ చెరువులో బిల్డింగ్ కట్టిన నర్సింహులతో ‘స్వేచ్ఛ’ మాట్లాడింది. ఈ సందర్భంగా కీలక విషయాలు తెలిపాడు. 2011లో తాను మూడెకరాల భూమిని తీసుకున్నానని చెప్పాడు. 250 గజాల భూమిలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టానని, తాను కొన్నప్పుడు పట్టా భూమి అనే అమ్మారని వివరించాడు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళితే అధికారులు ఎక్కడా కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని చెప్పలేదని వాపోయాడు. తానిప్పుడు 6 కోట్ల రూపాయలు నష్టపోయానని చెప్పారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవనం కట్టిన 12 ఏళ్ల తర్వాత కూల్చడం దారుణమని వాపోయాడు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×