E-Paper
Advertisement

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్
Advertisement

సంగారెడ్డి, స్వేచ్ఛ: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. అలాగే, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అయితే, ఏకంగా చెరువులోనే 5 అంతస్తుల భవనం కట్టేశారు. గురువారం దీనిని కూల్చివేశారు అధికారులు.

భవనంపైకి వెళ్లేందుకు ప్రత్యేక మెట్ల మార్గం

Advertisement

Also Read: కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు ఇదే ఒక కేస్ స్టడీ: సీఎం రేవంత్

మల్కాపూర్‌కు దగ్గరలో పెద్ద చెరువు ఉంటుంది. దానికి ఆనుకుని 5 అంతస్తుల అక్రమ నిర్మాణం జరిగిందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గ్రామానికి చేరుకుని చెరువులోనే ఉన్న బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. దీనికోసం డిటోనేటర్లను వాడారు. హైదరాబాద్‌కు చెందిన నర్సింహులు ఈ భవనానికి ఓనర్‌గా గుర్తించారు. నీటిలో అడుగు పెట్టకుండా భవనంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గాన్ని నిర్మించారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి సేద తీరేవారని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

కూల్చివేతలో అపశృతి

చెరువులో బహుళ అంతస్తుల భవనం ఉండడంతో అధికారులు బాంబులు అమర్చి కూల్చివేశారు. ఈ క్రమంలో శిథిలాలు ఎగిరిపడ్డాయి. అవి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

Also Read: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

పట్టా భూమి అంటేనే కొన్నా – భవనం ఓనర్

మల్కాపూర్ చెరువులో బిల్డింగ్ కట్టిన నర్సింహులతో ‘స్వేచ్ఛ’ మాట్లాడింది. ఈ సందర్భంగా కీలక విషయాలు తెలిపాడు. 2011లో తాను మూడెకరాల భూమిని తీసుకున్నానని చెప్పాడు. 250 గజాల భూమిలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టానని, తాను కొన్నప్పుడు పట్టా భూమి అనే అమ్మారని వివరించాడు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళితే అధికారులు ఎక్కడా కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని చెప్పలేదని వాపోయాడు. తానిప్పుడు 6 కోట్ల రూపాయలు నష్టపోయానని చెప్పారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవనం కట్టిన 12 ఏళ్ల తర్వాత కూల్చడం దారుణమని వాపోయాడు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×