E-Paper
Advertisement

Mallu Venkateswarlu Death: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇంట విషాదం.. అనారోగ్యంతో సోదరుడి మృతి!

Mallu Venkateswarlu Death: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇంట విషాదం.. అనారోగ్యంతో సోదరుడి మృతి!
Advertisement
Today news in telangana

Mallu Venkateswarlu death news: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు.. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషినల్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వైరా 1వ వార్డులో ఉన్న తన నివాసంలోనే హోమియో ఆస్పత్రిని నిర్వహిస్తూ.. ప్రజలకు వైద్యం అందిస్తూ వచ్చారు. మల్లు వెంకటేశ్వర్లుకు హోమియో వైద్యంలో మంచి పేరుంది. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల నుంచీ రోగులు వచ్చేవారు.

Advertisement

Read More : ఔటర్ రింగ్ రోడ్డుపై మెడికో ఆత్మహత్య.. కారణమేంటి ?

మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే మూడు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. కాలేయ సమస్య, గుండెపోటు కారణంగా ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. సాయంత్రం 5 గంటలకు స్వగ్రామమైన లక్ష్మీపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. భట్టి మరో సోదరుడైన మల్లురవి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి.. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

Tags

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×