E-Paper
Advertisement

Bhatti Vikramarka : పనిగట్టుకుని విమర్శలా ?

Bhatti Vikramarka : పనిగట్టుకుని విమర్శలా ?
Advertisement

– బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు
– మీ ఉడుత ఊపులకు బెదరం.. అభివృద్ధి ఆపం
– ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రజల్లో మత సామరస్యం
– అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యే లక్ష్యం
– ప్రభుత్వాన్ని అవమానించటమే పనిగా పెట్టుకుంటే ఊరుకోం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరిక

ఖమ్మం, స్వేచ్ఛ : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను స్కూల్‌కు వెళ్లే రోజుల్లో మోకాళ్ళ లోతు నీళ్లు, గుట్టల మీదుగా 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వైరా దాకా వెళ్లి చదువుకునే వాడినని అన్నారు. తన బిడ్డ వాగు, రోడ్డు దాటుకుంటూ ఎలా బడికి పోతాడు, ఎలా తిరిగి వస్తాడు అని తన తల్లిదండ్రులు ఆందోళన చెందేవారని చెప్పారు.

Advertisement

మీ కోసమే డిజైన్లు చేశాం…

రాష్ట్రంలోని పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దు అని, ప్రతి తల్లి కోరికను మనసులో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని డిజైన్లు చేశామని అన్నారు. మంత్రి మండలిలో చర్చించి డిజైన్లను ఖరారు చేశామని పేర్కొన్నారు.

Advertisement

అభివృద్ధి చేస్తున్నా విమర్శలా ?

కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు భట్టి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రజల్లో మత సామరస్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వాన్ని అవమానించటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు భోదన అందిస్తామని, సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తామని వివరించారు. ఈ స్కూళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాదికి రూ.5వేల కోట్లు కేటాయించామని చెప్పారు. మొదటి దశలో 28 స్కూళ్లకి శంకుస్థాపన చేసినట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఉడత ఊపులకు ఎవరూ భయపడరని, అభివృద్ధి ఆగదని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలు కూడా కొనసాగుతాయని, అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తామని స్పష్టం చేశారు భట్టి.

Also read : సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 60 రోజులే సమయం!

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×