Dharmapuri Sanjay: స్వేచ్చ బ్యూరో: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురాలుగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంపై నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్(Dharmapuri Sanjay) బిజెపి పై మండిపడ్డాడు. సంబంధం లేని కేసులు ఎరగా చూపి ఆమె యొక్క నామినేషన్లు తిరస్కరించడం పై తీవ్రంగా మండిపడ్డాడు.
విద్యావేత్త అయినటువంటి ఆమె రాజకీయ జీవితంలో ఎటువంటి కరప్షన్ లేకుండా గాంధీయవాదిగా ప్రజలకు సేవ చేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళుతున్న మీనాక్షి నటరాజన్ ను కావాలని మోడీ ప్రభుత్వం ఒక కేసును ఎరగా చూపి ఆమె యొక్క నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దీనిపై సత్వరం ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని ధర్మపురి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read: కవిత పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ పేరుపై కీలక మలుపు, వెల్లువెత్తిన 700 అభ్యంతరాలు, తెర వెనుక..
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను సాంకేతిక కారణాలు చూపుతూ తిరస్కరించడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని, ప్రజాస్వామ్య వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని వారు మండిపడ్డారు.
Also Read: కోర్టు నోటీసుల సాకుతో నామినేషన్ తిరస్కరిస్తారా?.. కేంద్రంపై టీపీసీసీ అధ్యక్షుడి ఆగ్రహం