K Kavitha: స్వేచ్చ బ్యూరో: విద్యార్థులు 36 రోజుల పాటు అలుపెరగకుండా చేసిన పోరాటంతోనే కేంద్రం దిగివచ్చిందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేయటంతో పాటు వారి అన్ని డిమాండ్లకు కేంద్రం అంగీకరించటం వెయ్యి శాతం విద్యార్థుల విజయమేనని చెప్పారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించటం సిగ్గుచేటన్నారు.
తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ విద్యార్థులు నిలదీస్తారోననే భయంతోనే, నగర వీధుల్లో ఊరేగింపులు చేస్తూ కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడారని మండిపడ్డారు. ఏనాడు తెలంగాణ యువత, విద్యార్థుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, ఇప్పుడు 21 ఏళ్లకే యువత పార్లమెంట్లో ఉండేలా బిల్లు తెస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్ హమీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత పార్లమెంట్ కు వెళ్లే బిల్లు తెస్తానని చెప్పటం సంతోషమేనని కవిత అన్నారు.
Also Read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్రలు?
కానీ అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టినా, కేంద్రం వద్ద ఆ బిల్లు పాస్ కాకుండా అంతర్గతంగా ఒప్పందం చేసుకుంటున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. బీసీ బిల్లు విషయంలో ఎలా మోసం చేస్తున్నారో బీసీలు గమనిస్తున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అట్టహాసంగా 1000 కోట్లు ఇస్తామని ప్రకటించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లో ఊరేగింపులు చేసినంత మాత్రాన మీ చరిత్రను, వైఫల్యాలను యువత మర్చిపోదన్నారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయమని హెచ్చరించారు.
Also read: Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి