E-Paper
Advertisement

President Droupadi Murmu: హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

President Droupadi Murmu: హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
Advertisement

President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న సందర్భంగా ముందుగానే.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి సీతక్క పలువురు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రాగానే.. గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి పుష్పగుచ్చాన్ని అందించి, పలువురు అధికారులు కూడా స్వాగతం పలికారు.

Advertisement

అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి కాన్వాయ్ బయలుదేరి వెళ్ళింది. రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో, పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు. రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన సాగుతున్న సందర్భంగా, హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read: Cm Revanth Reddy On Musi: హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి.. శాపం కావ‌ద్దు.. సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్

Advertisement

శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సందర్భంగా పోలీసులు హైదరాబాద్ లో భారీ బందోబస్తు చేపట్టారు.

Related News

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

Big Stories

Advertisement
×