E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్

Hyderabad News: హైదరాబాద్‌లో రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్

Hyderabad News: హైదరాబాద్ మహా నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), టాస్క్ ఫోర్స్, లంగర్ హౌస్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 70 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు సరఫరా

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ముఠా ప్రధానంగా ఒడిశా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయి, హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడైన వైకుంఠ రావు 2019 నుండి నగరంలో కార్ డ్రైవర్‌గా పని చేస్తూనే.. ఈ డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నాడు. గతంలోనూ ఇతనిపై రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నట్లు తేలింది.

భారీగా పట్టుబడిన మత్తు పదార్థాలు

ఈ దాడుల్లో పోలీసులు నిందితుల నుంచి 5 కిలోల హాష్ ఆయిల్, 5 కిలోల గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తు పదార్థాల అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు 70 లక్షల రూపాయలు ఉంటుందని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల గుండా పోలీసుల కళ్లు గప్పి ఈ ముఠా డ్రగ్స్‌ను నగరానికి తరలించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

100 మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల గుర్తింపు

ఈ కేసులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సుమారు 100 మంది వినియోగదారులను (Consumers) పోలీసులు గుర్తించారు. వీరిలో అత్యధికులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు చెందిన ఐటీ ఉద్యోగులు,  విద్యార్థులే ఉన్నట్లు డీసీపీ వైభవ్ తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వీరు డ్రగ్స్ ఊబిలో చిక్కుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

పునరావాస కేంద్రాలకు వినియోగదారులు

గుర్తించిన 100 మంది కన్జ్యూమర్లను కేవలం శిక్షించడం మాత్రమే కాకుండా, వారిని డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. వారిని కౌన్సెలింగ్ నిమిత్తం రియాబిలిటేషన్ సెంటర్లకు (పునరావాస కేంద్రాలకు) పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా వారు తిరిగి సాధారణ జీవితం గడిపేలా సహకరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

నగరంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రజలు సహకరించాలని డీసీపీ వైభవ్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ALSO READ: Job calendar: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఆర్ఆర్‌బీ

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×