E-Paper
Advertisement

DSC Candidates: ప్రజాభవన్‌కు క్యూ కట్టిన డీఎస్సీ 2008 అభ్యర్థులు..

DSC Candidates: ప్రజాభవన్‌కు క్యూ కట్టిన డీఎస్సీ 2008 అభ్యర్థులు..
Advertisement

DSC Candidates: కొలువు గ్యారంటీ అనే ప్రకటనతో ఆనంద పడ్డారు. సర్కారు బడిబాట పట్టే అవకాశం కల్పించారని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇటు ప్రైవేటు స్కూల్లో కొలువుపోయి.. అటు సర్కారు వారి ప్రకటనా ప్రకారం పోస్టింగ్ రాక.. ప్రజాభవన్ కు క్యూ కట్టారు. వీళ్లంతా 2008 డీఎస్సీ అభ్యర్ధులు. తమకు న్యాయం చేయాలంటూ ఇలా ప్రజాభవన్‌ లో ఆందోళన చేపట్టారు. తెలంగాణ 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల తెలంగాణ కాబినేట్ నిర్ణయించింది. ఆ మేరకు తెలంగాణ విద్యాశాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. జిల్లాల వారిగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.

ఇక కొలువులో చేరడమే తరువాయి అనుకున్నారు. ఇక ప్రభుత్వ బడి పడదామన్న ఉద్దేశంతో ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు కూడా వదిలేశారు. తమకు సెప్టెంబర్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు మూడు నెలలు గడిచినా నియామక పత్రాలు ఇవ్వలేదంటూ.. బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తక్షణమే తమకు నియామక పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డామని, తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read:  రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి.. పరిశోధనలకు పెద్దపీట వేస్తామన్న భట్టి విక్రమార్క

మీరు చేసిన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ల వల్ల తమ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి.. ఆత్మహత్యలకు దారితీసే విధంగా ఏర్పడిందని.. డీఎస్సీ 2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసేందుకు ప్రజాభవన్‌కు చేరుకున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి రెండు, మూడు నెలలు గడుస్తున్న పోస్టింగ్ రాకపోవడంతో.. తమ సర్వీస్ కాలపరిమితిని, ఆ సమయం లోని ప్రయోజనాల్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తమ విన్నపాన్ని తక్షణమే ప్రభుత్వం ఆలకించి ఒకవారంలోనే ఉద్యోగంలో చేరేలా అభ్యర్ధులు వేడుకున్నారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×