E-Paper
Advertisement

Karimnagar News: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది బాలికలకు అస్వస్థత

Karimnagar News: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది బాలికలకు అస్వస్థత

Karimnagar News: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత సుమారు 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొడిగ్రుడ్డు ఫ్రైతో కూడిన భోజనం తీసుకున్న అనంతరం వారికి తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలో ఆందోళన వాతావరణం నెలకొంది.

అస్వస్థతకు గురైన విద్యార్థినులను వెంటనే పాఠశాల సిబ్బంది అప్రమత్తమై జమ్మికుంటలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు తక్షణమే ప్రథమ చికిత్స అందించారు. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ సంఘటన గురించి తెలియగానే కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు. ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి, జమ్మికుంటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రికి వివరించారు.

విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక సూచన చేశారు. అవసరమైతే, విద్యార్థినులకు మరింత మెరుగైన చికిత్స అందించడానికి వారిని వెంటనే కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్‌కు ఆయన ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఏ చిన్న ఆరోగ్య సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నాణ్యతలేని భోజనంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ ఘటనతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై మరోసారి ఆందోళన నెలకొంది. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Indira Mahila Shakti Sarees: మహిళలకు శుభవార్త.. చీరల పంపిణీకి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×