E-Paper
Advertisement

MLC Kavitha : మూడోసారి 10 గంటలపాటు ఈడీ విచారణ.. నెక్ట్స్ ఏంటి?

MLC Kavitha : మూడోసారి 10 గంటలపాటు ఈడీ విచారణ.. నెక్ట్స్ ఏంటి?
Advertisement

MLC Kavitha : ఎలాంటి సంచలనాలు లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ మూడోసారి ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను రాత్రి 9.40 గంటల వరకు అధికారులు ప్రశ్నించారు.

కవితను విచారిస్తున్న సమయంలో బీఆర్ఎస్ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీ సోమా భరత్‌ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్‌ను కార్యాలయానికి పిలిచారు. ఆమెకు సంబంధించిన ఆథరైజేషన్‌ సంతకాల కోసం పిలిచారని సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమా భరత్‌ని పంపించేందుకు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు భరత్‌కు అవకాశం కల్పించేందుకే పిలిపించినట్టు తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళ్తున్నట్లు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో.. విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లారు.

Advertisement

తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని తెలుపుతూ ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేంద్రకు కవిత లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్‌ ఫోన్లను కోరారని.. అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తునకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.

విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. ఉదయం నుంచే భారీగా బలగాలను మోహరించారు. కవిత అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలను దూరంగా పంపించేశారు.
వరుసగా రెండురోజుల పాటు 10-10 గంటల చొప్పున కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు.

Advertisement

సోమవారం కవిత బినామీగా భావిస్తున్న రామచంద్ర పిళ్లైను ఎదురుగా ఉంచి ప్రశ్నలు అడిగారు. సమీర్ అరోరా, మనీశ్ సిసోడియాల సమక్షంలోనూ విచారించారు. సోమవారం కవితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగినా అలా జరగలేదు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించడంతో అరెస్టుపై ఉత్కంఠ కొనసాగింది. మంగళవారం కూడా కవిత విచారణ సుదీర్ఘంగా సాగింది. కవిత అందజేసిన ఫోన్లలోని డేటా ఆధారంగా ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఫోన్లు ఎందుకు మార్చారని.. లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ ఎలా వచ్చిందని.. సౌత్ గ్రూప్ తరఫున 100 కోట్లు ముడుపులు ఇచ్చారా అని.. ఇండోస్పిరిట్‌లో మీ బినామీ రామచంద్ర పిళ్లైకి వాటాలు ఎలా వచ్చాయని.. ఇలా అనేక కోణాల్లో సమగ్రంగా విచారించారని సమాచారం. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. మరోసారి అరెస్ట్ చేయకుండానే కవితను ఈడీ పంపించింది.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×