E-Paper
Advertisement

Ramdev Rao: లీజు పేరుతో భూకబ్జా? ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు తీరుపై రైతుల పోరాటం

Ramdev Rao: లీజు పేరుతో భూకబ్జా? ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు తీరుపై రైతుల పోరాటం

Ramdev Rao: రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామ పరిధిలోని ఎక్స్ పీరియమ్ ఎకో పార్క్ (Experium Eco Park) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. ఈ పార్క్ యజమాని రాందేవ్ రావు తమను మోసం చేశారంటూ స్థానిక రైతులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఐదేళ్ల కాల పరిమితికి అని నమ్మబలికి, అక్రమంగా 99 సంవత్సరాల పాటు భూమిని లీజుకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ జీవితాధారమైన భూమిని లాక్కున్నారని వారు వాపోతున్నారు.

రైతుల కథనం ప్రకారం.. మొదట్లో పార్క్ అభివృద్ధి కోసం భూమిని అడిగినప్పుడు, స్వల్ప కాలానికి మాత్రమే ఒప్పందం అని చెప్పారు. కానీ, తీరా ఒప్పంద పత్రాలను పరిశీలిస్తే అవి 99 ఏళ్ల లీజుకు మార్చబడ్డాయని రైతులు గుర్తించారు. దీనిపై ప్రశ్నించిన రైతులకు లీజు పత్రాలు చూపించకపోగా, రావలసిన నగదును కూడా చెల్లించకుండా రాందేవ్ రావు కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుకుబడితో తమ నోరు నొక్కేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ఈ భూ వివాదం వల్ల తమకు జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ భూములను తమకు ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూమిని ఇలా మోసపూరితంగా లాక్కోవడం వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని, న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతులు హెచ్చరిస్తున్నారు. తమ గోడును పట్టించుకోకపోతే, అందరం కలిసి రాందేవ్ రావు పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామని వారు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ప్రకటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక వ్యాపారవేత్త స్వలాభం కోసం వందలాది ఎకరాల రైతు భూములను ఇలా ఇబ్బందుల్లోకి నెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. స్పాట్లో 85 మంది

ప్రస్తుతానికి ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ భూ లీజు ఒప్పందాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, మోసపోయిన రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×