E-Paper
Advertisement

Father and Daughter body found: తెలంగాణలో వరదలు.. మిస్సయిన తండ్రీ-కూతురు బాడీ లభ్యం..

Father and Daughter body found: తెలంగాణలో వరదలు.. మిస్సయిన తండ్రీ-కూతురు బాడీ లభ్యం..
Advertisement

Father and Daughter body found: ఆదివారం వరదల్లో కారుతో గల్లంతయిన తండ్రి-కూతురు మృతదేహాలు లభ్యమయ్యాయి. కూతురు అశ్విని డెడ్‌బాడీ లభించగా, సోమవారం తండ్రి మోతీలాల్ మృత దేహం లభ్యమైంది. వీరిని ఆ స్థితిలో చూసి కన్నీరుమున్నీరయ్యారు కుటుంబసభ్యులు.

గడిచిన రెండురోజులుగా తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో గజగజలాడించింది. అయితే మహబూబాబాద్ జిల్లా పురుషోత్త మాయగూడెం వద్ద ఆకేరు వాగులో కారుతో సహా కొట్టుకుపోయారు తండ్రి మోతిలాల్, కూతురు అశ్విని. వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమ్మరి తండా సమీపంలో మోతీలాల్ బాడీని గుర్తించారు.

Advertisement

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారానికి చెందిన అశ్విని, ఢిల్లీ విత్తన పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా పని చేస్తోంది. వారం కిందట ఖమ్మం వచ్చిన అశ్విని, సెలవులు పూర్తికావడంతో బయలుదేరింది.

ఆమె తండ్రి మోతీలాల్ ఆదివారం తన కూతుర్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి తీసుకొస్తున్నారు. మోతీలాల్ ప్రయాణిస్తున్న కారు.. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. సాయంత్రానికి అశ్విని మృతదేహాన్ని గుర్తించారు.

Advertisement

చివరకు సోమవారం ఉదయం తండ్రి మోతీలాల్ బాడీని కుమ్మరి‌తండా వద్ద కనుగొన్నారు. అయితే ఘటనకు ముందు తాము ప్రమాదంలో ఉన్నామని చివరిసారి కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడారు మోతీలాల్. ఆ మాటలు ఇప్పుడు బంధువులను కంటతడి పెట్టిస్తున్నాయి.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×