E-Paper
Advertisement

Karimnagar: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..

Karimnagar: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..
Advertisement

Fire Accident In Karimnagar: తెలంగాణలోని కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.
వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. వారంతా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇక్కడ మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారి మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగిసి పడ్డాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి.

పూరిళ్లలోని 5 గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

Advertisement

Read More: బ్లడ్ బ్యాంకుల్లో ప్లాస్మా దందా.. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ సెంటర్లు సీజ్

జగిత్యాల రహదారిలోని సుభాష్ నగర్ లో కార్మికుల కుటుంబాలు నివసిస్తున్నాయి. పూరిళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. వారంతా మేడారం జాతరకు తరలివెళ్లారు. ఈ సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఆ గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పూరిళ్లు మాత్రం కాలిబూడిదయ్యాయి.

Tags

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×