BigTV English
Advertisement

Fire Accident: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..

Fire Accident: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..
Fire Accident in sangareddy
Fire Accident

Fire accident in sangareddy(Telangana news live): సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌లో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరక్టర్ రవి, నలుగురు కార్మికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.


అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తo చేసిన ముఖ్యమంత్రి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.


రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×