E-Paper
Advertisement

Narayanpet News : పాఠశాలలో వికటించిన భోజనం.. ఆసుపత్రి పాలైన 25 మంది విద్యార్థులు

Narayanpet News : పాఠశాలలో వికటించిన భోజనం.. ఆసుపత్రి పాలైన 25 మంది విద్యార్థులు

Narayanpet News : నారాయణ పేట్ జిల్లా ధన్వాడలోని బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. విద్యార్థులు తిన్న భోజనంలో కల్తీ కావడంతో.. దాదాపు 25 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైయ్యారు. వారందరికీ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆసుపత్రికి తరలించగా, ఆహారం కల్తీగా వైద్యులు నిర్ధరించారు. ప్రభుత్వ  పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు  ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే.. కొన్ని మెస్ లలో,  హాస్టళ్లల్లో ఆహార కల్తీ ఘటనలు తీవ్ర చర్చనీయాంశం కాగా.. మరోసారు నారాయణ పేట్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

విద్యార్థులందరినీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారందరి ఆరోగ్యం స్థిమితంగానే ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. కావాల్సిన మందులు అందించారు. కాగా.. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనకు కారణాలను అన్వేషిస్తున్నారు. విద్యార్థులకు అందించి ఆహారం ఏ తీరుగా విషపూరితంగా మారిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×