BigTV English

Narayanpet News : పాఠశాలలో వికటించిన భోజనం.. ఆసుపత్రి పాలైన 25 మంది విద్యార్థులు

Narayanpet News : పాఠశాలలో వికటించిన భోజనం.. ఆసుపత్రి పాలైన 25 మంది విద్యార్థులు

Narayanpet News : నారాయణ పేట్ జిల్లా ధన్వాడలోని బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. విద్యార్థులు తిన్న భోజనంలో కల్తీ కావడంతో.. దాదాపు 25 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైయ్యారు. వారందరికీ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆసుపత్రికి తరలించగా, ఆహారం కల్తీగా వైద్యులు నిర్ధరించారు. ప్రభుత్వ  పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు  ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే.. కొన్ని మెస్ లలో,  హాస్టళ్లల్లో ఆహార కల్తీ ఘటనలు తీవ్ర చర్చనీయాంశం కాగా.. మరోసారు నారాయణ పేట్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.


విద్యార్థులందరినీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారందరి ఆరోగ్యం స్థిమితంగానే ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. కావాల్సిన మందులు అందించారు. కాగా.. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనకు కారణాలను అన్వేషిస్తున్నారు. విద్యార్థులకు అందించి ఆహారం ఏ తీరుగా విషపూరితంగా మారిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.


Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×