Farmer Exploitation: స్వేచ్ఛ బ్యూరో: రైస్ మిల్లర్ల దోపిడీని నిరూపిస్తాం.. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. దాన్యం కొనుగోలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుందని.. ఆరుగాలం పండించిన రైతు అడ్డుకి పౌరుషరుల దాన్యం అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు 120 నుంచి 263 రూపాయల వరకు రైతు దోపిడికి గురయ్యారని ఆరోపించారు. 1000 కోట్ల రూపాయల విలువచేసే ధాన్యంలో రైస్ మిల్లర్స్ దోపిడి చేశారని మండిపడ్డారు. ధర్మకాంత తూకాన్ని పరంలోకి తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయని వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ రైతులకు అండగా నిలబడి రైతాంగాన్ని ఆదుకున్నారని తెలిపారు. ఎలినినో ప్రభావంతో రైతులు సాగులో ముందుకు పోలేకపోతున్నారని.. ఏడు రకాల మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం ప్రకటన ఇస్తుందని మండిపడ్డారు. దిగుబడి లేని పంటలను సాగుచే యమనడం సరికాదన్నారు. ఏడు రకాల పంటలకు చీడపురుగుల సమస్య తలెత్తుతుందని.. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకునే అందుకే ప్రభుత్వం ఇలా చేస్తుందని మండిపడ్డారు.
Also Read: Gadwal Protest: న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..!
రవి సీజన్ బోనస్ ఈ ప్రభుత్వ మర్చిపోయిందని.. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఈ ప్రభుత్వం తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ రైతుబంధు 10,000 ఇస్తే కాంగ్రెస్ 15000 ఇస్తామని రైతులను మోసం చేసిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లోనైనా రైతు భరోసా 15000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ నాకే అర్థం కావడంలేదని సాధారణ రైతుకు యాప్ ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో యూరియా కోసం యాప్ లేదు ఇక్కడ ఎందుకు అని నిలదీశారు. రైతు బీమా ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏరియా కోసం రైతులు పడిగాపులు కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also read: ఎకరం రూ.237 కోట్లు.. కట్ చేస్తే హైకోర్టులో షాక్.. SBI ఎంట్రీతో వేలంపై స్టే!