Gadwal Protest: స్వేచ్చ బ్యూరో: తన భార్యతో అక్రమ సంబంధం కొనసాసగిస్తున్న ఒక ఏఅర్ హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి పెట్రోల్ బాటిల్తో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాసగిస్తున్న ఒక ఏఅర్ హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధితుడు డిమాండ్ చేశాడు. న్యాయం చేస్తామని గద్వాల సీఐ హామీ ఇవ్వడంతో బాధితుడు వాటర్ ట్యాంక్ దిగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బాధితుడు నరేష్ చారి కథనం ప్రకారం.. తన భార్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్తో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, దీనివల్ల తన కుటుంబ జీవితం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అక్రమ సంబంధం వ్యవహారంపై గతంలో తాను గద్వాల పట్టణ పోలీసులకు అనేకసార్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని నరేష్ చారి ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై, విసిగిపోయి ఈ ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు.
Also read: తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి
విషయం తెలుసుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ తక్షణమే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ పైనున్న నరేష్ చారితో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి, కౌన్సిలింగ్ ఇచ్చారు. బాధితుడికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హామీ ఇచ్చారు. గద్వాల సీఐ ఇచ్చిన నమ్మకమైన భరోసాతో శాంతించిన నరేష్ చారి ఎట్టకేలకు వాటర్ ట్యాంక్ కిందికి దిగివచ్చాడు. దీంతో గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరపడటంతో పోలీసులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
Also read: దేశ వ్యాప్తంగా 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!