E-Paper
Advertisement

Gadwal Protest: న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..!

Gadwal Protest: న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..!
Advertisement

Gadwal Protest: స్వేచ్చ బ్యూరో: తన భార్యతో అక్రమ సంబంధం కొనసాసగిస్తున్న‌ ఒక ఏఅర్ హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి పెట్రోల్ బాటిల్‌తో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాసగిస్తున్న‌ ఒక ఏఅర్ హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధితుడు డిమాండ్ చేశాడు. న్యాయం చేస్తామని గద్వాల సీఐ హామీ ఇవ్వడంతో బాధితుడు వాటర్ ట్యాంక్ దిగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌తో..

బాధితుడు నరేష్ చారి కథనం ప్రకారం.. తన భార్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, దీనివల్ల తన కుటుంబ జీవితం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అక్రమ సంబంధం వ్యవహారంపై గతంలో తాను గద్వాల పట్టణ పోలీసులకు అనేకసార్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని నరేష్ చారి ఆరోపించాడు.‌ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై, విసిగిపోయి ఈ ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు.

Advertisement

Also read: తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి

చర్యలు తీసుకుంటామని హామీ..

విషయం తెలుసుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ తక్షణమే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ పైనున్న నరేష్ చారితో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి, కౌన్సిలింగ్ ఇచ్చారు. బాధితుడికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హామీ ఇచ్చారు.‌ గద్వాల సీఐ ఇచ్చిన నమ్మకమైన భరోసాతో శాంతించిన నరేష్ చారి ఎట్టకేలకు వాటర్ ట్యాంక్ కిందికి దిగివచ్చాడు. దీంతో గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరపడటంతో పోలీసులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Also read: దేశ వ్యాప్తంగా 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×