Nizamabad Road Accident: నిజామాబాద్ స్వేచ్ఛ, బ్యూరో, జాతీయ రహదారి 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలో ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం గన్నారం శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా బస్సు గన్నారం శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇందులో చనీ పోయినా వారిలో తల్లి మంజూష, కొడుకు రిషి (7), మరో ప్రయాణికుడు అబ్బాస్ మరో ప్రయాణికుడు వివరాలు తెలియ రాలేదు. పలువురు తీవ్రంగా గాయపడడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందల్వాయి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Monalisa -Farman khan: మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కూడా నటుడా .. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే?
జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని శుక్రవారం రవాణా శాఖ కమిషనర్ దుర్గాప్రమీల, ఆర్టీవో ఉమామహేశ్వర్రావులతో కూడిన బృందం పరిశీలించింది. బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ క్రమంలో బస్సులో అధికారులు రామచిలుక పెట్టెను గమనించి బయటకు తీశారు. ఈ నేపథ్యంలో బాక్స్లో సుమారు 60 రామచిలుకలను కుక్కినట్లుగా ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ చిలుకలను స్థానిక పశువైద్యశాలకు తరలించారు. తనిఖీల్లో ఎంపీఐ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.