Big Stories

Hyderabad To Ayodhya: రామ భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ టూ అయోధ్యకు ఫ్లైట్..

Hyderabad To Ayodhya
Hyderabad To Ayodhya

Hyderabad To Ayodhya Flight(Today latest news telugu): 500 ఏళ్ల తర్వాత రామజన్మభూమిలో నిర్మించిన రామమందిరాన్ని, బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల నుంచి ఉచిత రైలు, బస్సు ప్రయాణాలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇటీవలె ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. తాజాగా మరోసారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

- Advertisement -

హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విమానాన సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో లేఖపై స్పందించిన జ్యోతిరాదిత్య విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ విమానం ఏప్రిల్ 2 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఇది వారానికి 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అందులో మంగళవారం, గురువారం, శనివారాల్లో భక్తులకు విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Also Read: తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..

కాగా, జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. తరువాత రోజు నుంచే సామాన్య ప్రజలకు అయోధ్య దర్శనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News