Avanigadda seat for Mandali(Latest news in Andhra Pradesh): ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఓ సీటును జనసేన దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా అవనిగడ్డ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి హైకమాండ్ దాదాపు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
తెలుగుదేశం-బీజేపీ కూటమిలో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు వెళ్లింది. ఆ పార్టీ నుంచి అక్కడ చాలామంది టికెట్ ఆశించారు. కాకపోతే క్లీన్ ఇమేజ్ పర్సన్ కోసం జనసేన ప్రయత్నాలు చేసింది. చివరకు మండలి బుద్ధప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. దానికితోడు ఆ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్కు మాంచి పేరుంది. జనసేన నిర్వహించిన సర్వేలో కూడా ఆయన వైపు చాలామంది మొగ్గుచూపారు. ఈ క్రమంలో జనసేన నేతలు బుద్ధప్రసాద్ను సంప్రదించడం అందుకు ఆయన ఓకే చేసినట్టు వార్తలొస్తున్నాయి.
ALSO READ: అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆ ఫైల్ పైనే.. చంద్రబాబు కీలక హామీ
అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ మూడుసార్లు గెలుపొందారు. రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఒకసారి టీడీపీ తరపున ఆయన విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న సింహాద్రి ఫ్యామిలీ ఎదుర్కోవాలంటే బుద్ధప్రసాద్ కరెక్టయిన వ్యక్తని పవన్ భావించారు. ఆయనకు సీటు ఇస్తే విజయావకాశాలు ఉంటాయని జనసేన భావించింది. ముఖ్యంగా మచిలీపట్నం కూటమి అభ్యర్థి బాలశౌరి కూడా తన మద్దతు బుద్ధప్రసాద్కే ప్రకటించారట. ప్రస్తుతం పిఠాపురంలో ఉన్న పవన్కల్యాణ్ను ఆయన సోమవారం కలవనున్నారు. పవన్కల్యాణ్ అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.