E-Paper
Advertisement

ప్రభుత్వం పాఠశాలలో మెరిసిన ముత్యం.. బాసర ఐఐఐటీకి ఎంపికైన హుజూరాబాద్ విధ్యార్ధిని..?

ప్రభుత్వం పాఠశాలలో మెరిసిన ముత్యం.. బాసర ఐఐఐటీకి ఎంపికైన హుజూరాబాద్ విధ్యార్ధిని..?
Advertisement

Basara IIIT: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలో చదివి, పట్టుదలతో శ్రమించిన ఒక గ్రామీణ విద్యార్థిని ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీ (IIIT) సీటు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల (UPS)లో ప్రాథమిక విద్యనభ్యసించిన కళ్లెపు అభినయశ్రీ ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ కుమార్తె అయిన అభినయశ్రీ.. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుల గుర్తింపు పొందింది.

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

ఉపాధ్యాయుల ఘన సత్కారం

Advertisement

పరిమిత వసతుల మధ్య ప్రభుత్వ బడిలో చదివి ఐఐఐటీ సీటు కైవసం చేసుకున్న అభినయశ్రీని ఇప్పల్ నర్సింగాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినయశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులను శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభకు ఈ విజయమే నిదర్శనమని, తోటి విద్యార్థులకు అభినయశ్రీ ఆదర్శంగా నిలిచిందని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×