Basara IIIT: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలో చదివి, పట్టుదలతో శ్రమించిన ఒక గ్రామీణ విద్యార్థిని ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీ (IIIT) సీటు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల (UPS)లో ప్రాథమిక విద్యనభ్యసించిన కళ్లెపు అభినయశ్రీ ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ కుమార్తె అయిన అభినయశ్రీ.. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుల గుర్తింపు పొందింది.
Also Read: బడ్జెట్లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!
పరిమిత వసతుల మధ్య ప్రభుత్వ బడిలో చదివి ఐఐఐటీ సీటు కైవసం చేసుకున్న అభినయశ్రీని ఇప్పల్ నర్సింగాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినయశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులను శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభకు ఈ విజయమే నిదర్శనమని, తోటి విద్యార్థులకు అభినయశ్రీ ఆదర్శంగా నిలిచిందని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read: టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!