Telangana NRIs Alert: తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులను ఎన్నికల సంఘం అలర్ట్ చేసింది. తమ ఓటర్ ఐడీకి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో జూన్ 15 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఎన్నారైలకు ఈసీ అలర్ట్
తమ తమ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఆన్లైన్లో వివరాలను సమర్పించడం సాధ్యం కాదని తేల్చేసింది. ఓటర్ల జాబితాలో చేరడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్బంగా అధికారులు వెల్లడించారు. విదేశాల్లో నివసిస్తున్నవారు తమ ఓటు హక్కును కాపాడుకోవాలనుకునే ప్రక్రియ చాలా కీలకమైనది.
నిర్ణీత గడువులోగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములుగా కొనసాగవచ్చు. ఎన్నారైలు తమ మొబైల్ నంబర్ను లింక్ చేయడానికి ఈసీఐ అధికారిక పోర్టల్ కి వెళ్లాలి. ఫారం-8 ను ఓపెన్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చే ఓటీపీతో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఓటర్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ కావాల్సిందే-ఈసీ
ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉండాలని పేర్కొంది. ఫారం సమర్పించేటప్పుడు ఆధార్ అథెంటికేషన్ అవసరమని అధికారులు తేల్చిచెప్పారు. తెలంగాణలో జరగనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.
వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 15 నుంచి 24 వరకు ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేయనున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 30 వరకు స్వీకరిస్తారు. అక్టోబర్ ఒకటిన ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
ALSO READ: జనసేన అధినేత వ్యాఖ్యలు.. ఆపై కేటీఆర్ రియాక్ట్, ఏయే అంశాలు ఒక్కసారి