Goyaz New Showroom: భారతదేశపు అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన GOYAZ మరో కీలక మైలురాయిని చేరుకుంది. గోయాజ్ 24వ స్టోర్ను హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో శనివారం ఫిబ్రవరి 21వ తేదీన ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన షోరూం ప్రారంభోత్సవం ఉదయం వేళ చాలా వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వేములూరి రాజేంద్ర కుమార్, రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి పాల్గొన్నారు. అలాగే గోయాజ్ డిస్ట్రిబ్యూటర్స్, సంస్థ ప్రతినిధులు మరియు ఆహ్వానితులు కూడా హాజరై ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. వెండి ఆభరణాల రంగంలో నూతన ధోరణిని తీసుకొస్తూ..గోయాజ్ ఇప్పటికే దక్షిణ భారతదేశం అంతటా వేగంగా విస్తరిస్తోంది.
దిల్సుఖ్నగర్లో ప్రారంభమైన ఈ స్టోర్ను సుమారు 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా డిజైన్ చేశారు. స్టోర్లోకి అడుగుపెట్టగానే వినియోగదారులకు ఒక ప్రీమియం షాపింగ్ అనుభవం కలుగుతుంది. ఇక్కడ మునుపెన్నడూ చూడని విధంగా వెండి ఆభరణాల విస్తృత కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ డిజైన్స్తో పాటు ఆధునిక ఫ్యాషన్కు తగ్గ ఆభరణాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
స్టోర్ ప్రారంభం సందర్భంగా గోయాజ్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 15 వరకు ఈ ప్రారంభ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. రూ.1,00,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే రూ.30,000 విలువైన గిఫ్ట్ వోచర్ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రూ.50,000 కొనుగోలుపై రూ.15,000 వోచర్, రూ.25,000 కొనుగోలుపై రూ.7,500 వోచర్, రూ.10,000 కొనుగోలుపై రూ.3,000 వోచర్ ఉచితంగా పొందవచ్చు.
భవిష్యత్తులో మరిన్ని కొత్త నగరాల్లో తన శాఖలను ప్రారంభించేందుకు గోయాజ్ సిద్ధమవుతోంది. వెండి ఆభరణాలను ప్రేమించే వారికి లగ్జరీతో కూడిన ప్రత్యేక అనుభవాన్ని అందించడమే గోయాజ్ లక్ష్యం. మీ వెండి ఆభరణాల విశ్వసనీయమైన లగ్జరీ గమ్యస్థానం – గోయాజ్, దిల్సుఖ్నగర్.
ALSO READ: Anupama Parameswaran: కార్తికేయ 2 తరువాత దానికి దూరంగా అనుపమ…మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ పని చేసిందా?