E-Paper
Advertisement

Graduate MLC Polling: మందుబాబులకు భారీ షాక్.. బంద్ కానున్న లిక్కర్ షాపులు

Graduate MLC Polling: మందుబాబులకు భారీ షాక్.. బంద్ కానున్న లిక్కర్ షాపులు
Advertisement

Wine shops, bars will shut down(Latest news in telangana): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లా పట్టభుద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటలపాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నారు.

పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 27 వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. ఇందుకుగాను షిఫ్టుల సర్దుబాటు గానీ, ఓటు వేసి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులను ఆలస్యంగా వచ్చారంటూ భావించకుండా వారిని విధుల్లోకి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే, వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 4,61806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు: మంత్రి జూపల్లి

Advertisement

కాగా, తెలంగాణలో ఈ నెల 13న జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం విధితమే.

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×