E-Paper
Advertisement

Harish Rao: అధికార గర్వంతో అరాచకాలు.. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొడతారు: హరీష్ రావు సంచలన ట్వీట్!

Harish Rao: అధికార గర్వంతో అరాచకాలు.. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొడతారు: హరీష్ రావు సంచలన ట్వీట్!
Advertisement

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

అధికార గర్వంతో దాడులు

Advertisement

నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు కాంగ్రెస్ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే కాకుండా.. వారిపై భౌతిక దాడులకు తెగబడటం అత్యంత హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అధికార పార్టీయే ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.

పోలీసుల తీరుపై విమర్శలు

Advertisement

ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారుల ప్రవర్తనను కూడా హరీష్ రావు తప్పుబట్టారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే అధికార పార్టీ నాయకుల కళ్లల్లో ఆనందం కోసం పనిచేయడం గర్హనీయమని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోకుండా, అధికార పక్షానికి కొమ్ముకాయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ తన నిష్పాక్షికతను కోల్పోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

ప్రజల తీర్పును ప్రభావితం చేయలేరు

ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజల తీర్పును మార్చలేరని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. డబ్బు సంచులు, అధికార బలం చూపి ఓటర్లను ప్రలోభపెట్టాలని చూసినా.. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, వారు సరైన నిర్ణయమే తీసుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పన్నిన దుష్ట పన్నాగాలు బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేవని స్పష్టం చేశారు.

కార్యకర్తలకు అభినందనలు

ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులను ఆయన అభినందించారు. అధికార పార్టీ ఎన్ని ఆకృత్యాలకు పాల్పడినా.. అదరకుండా బెదరకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి నిమిషం వరకు శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ఓటర్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ALSO READ: Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయం : మహేష్ కుమార్ గౌడ్

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×