Hyderabad: జనసేన పార్టీకి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు న్యాయస్థానానికి వెళ్లిన ఆపార్టీకి నిరాశ ఎదురైంది. ఆ పార్టీలు నేతలు హైకోర్టులో మంగళవారం ఉదయం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.
హైదరాబాద్లో భారీ సభ నిర్వహించుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది జనసేన. దీన్ని పరిశీలించిన రిజిస్ట్రీ హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత లేదని పేర్కొంది. దీంతో పిటిషన్ను తిరస్కరించింది. భారీ సభ నిర్వహణకు ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పుడు న్యాయస్థానంలోనూ జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది.
జరుగుతున్న పరిణామాలను ముందుగానే పసిగట్టిన జనసేన చీఫ్, సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియా సమావేశానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరిన సంగతి తెల్సిందే. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం జనసేనకు మింగుడు పడలేదు.