Telangana High Court: హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో.. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని.. FTL నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారని.. హద్దుల విషయంలో ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నలవర్షం కురిపించింది.
సున్నం చెరువు సియేట్ కాలనీలో ఉన్నవారిపై హైడ్రా చర్యలు.. ఆర్టికట్ 300A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. సియేట్ కాలనీ వాసుల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడం కానీ, కూల్చివేతలు కానీ చేపట్టొద్దని హైడ్రాను ఆదేశించింది హైకోర్టు.
మరోసారి హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
రాజ్యాంగ హక్కులను హైడ్రా ఉల్లంఘించిందంటూ మండిపాటు
సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఘాటు విమర్శలు
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారు అంటూ ప్రశ్న
గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు… pic.twitter.com/eocxPZeSmV
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2025