TTD Donation: హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని హైదరాబాద్కు చెందిన ఓ ఇద్దరు వ్యాపార వేత్తలు కలిసారు. వడ్లమూడి లలిత్ కుమార్, మరియు యలమంచిలి కృష్ణారావు అనే వ్యాపార వేత్తలు మర్యాద పూర్వకంగా బీఆర్ నాయుడిని కలిసారు. అనంతరం వారు బీఆర్ నాయుడికి రూ 10 లక్షలు చొప్పున టీటీడికి సంస్థానానికి అందించారు.
చెక్కును విరాళం రూపంలో అందచేశారు. మహాయజ్ఞంలా నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు వితరణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీంతో ఇంత గొప్ప సహకారం అందించిన దాతలను టీటీడి చైర్మన్ బీఆర్ నాయుడు వారిని అభినందించారు. దైవ ఆశీర్వాదాలు మీకు ఎప్పడూ ఉంటాయని తెలిపారు.
Also read: NEET Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. నీట్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ‘థాలీ బజావో’ నిరసన!
తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం లక్షలాది మంది భక్తులకు ప్రతి రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి దర్శనానికి పలు ప్రాంతాల నుండి భక్తులు తండో తండాలుగా వస్తుంటారు. దీంతో వచ్చే ప్రతి భక్తుడికి అక్కడ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో టీటీడీ సంస్థనం నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇత మంచి పవిత్ర మైన కార్యక్రమానికి సహకారం అందించిన వ్యాపార వేత్తలు వడ్లమూడి లలిత్ కుమార్, యలమంచిలి కృష్ణారావులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు.
Also read: Bhagirath Bail: బిగ్ బ్రేకింగ్.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్కి బెయిల్