NEET Protest: నేడు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు థాలీ బజావో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యువకులంతా కలిసి ప్లేట్లు, స్పూన్లతో రావాలని సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే విధ్యార్దులకు మరియు యువకులకు పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపు నిచ్చారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనాతా పార్టీ నాయకులు భారీగా నిరసనలతో డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీలో విద్యార్ధుల జీవితాలను నాశనం చేసిన మంత్రి వెంటనే క్షమాపన చెప్పి తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. నీట్ పరీక్ష లీకేజితో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రూపాయల చోప్పున నష్ట పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
మోత్తం ఢిల్లిలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థతులు ఎర్పడ్డాయి. వందలాది మంది విద్యార్ధులు అక్కడికి చేరుకొని కేంద్రానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్తో పాటు దేశంలోని ముఖ్యప్రాంతాల్లో కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రానికి వ్యతిరేఖంగా ధర్నాలు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే!
Also read: Singareni Tension: భూపాలపల్లిలో రణరంగం.. సింగరేణి గని వద్ద కవితను అడ్డుకున్న పోలీసులు!