తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమైదైన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే బండి భగీదథ్ ఫోక్సో కేసులో భాగంగా దాదాపుగా నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు. దీనిలో భాగంగా నేడు బండి భగీరథ్కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఒ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో అతని పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. గతంలో 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, తమ కుమార్తె పై బండి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడి, అసబ్యకరంగా ప్రవర్తిచాడని బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Also read: NEET Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. నీట్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ‘థాలీ బజావో’ నిరసన!
అయితే గత నెల రోజుల నుండి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి భగీరథ్ అతని తరుపున న్యాయవాది మల్కాజ్ గిరి జిల్లా కోర్టు న్యాయవాది రెగ్యలర్ బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేసారు. పోలీసులకు, కోర్టుకు కావలసిన విచారణకు నిందింతుడు సహకరించినందున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు భగీరథ్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. పోలీసులకు సహకరించి, విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చేలా ఉండాలని కొన్ని కఠిన మైన షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
Also read: ఊహించని ట్విస్ట్.. మొబైల్ దొంగలపై కూలీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్!