E-Paper
Advertisement

Government Land Encroachment: రూ. 2 వేల కోట్ల భూ దందా.. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమికి ఎసరు!

Government Land Encroachment: రూ. 2 వేల కోట్ల భూ దందా.. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమికి ఎసరు!

Government Land Encroachment: ప్రస్తుత కాలంలో  ప్రభుత్వ ఆస్తిని  గౌరవం వించాల్సింది పోయి..  ప్రభుత్వ భూమి అంటే ఎవరైనా ఆక్రమించుకోవచ్చు అనే చులకన భావం పెరిగిపోయింది. సమాజంలో ఎక్కడైనా ఒక ఖాళీ స్థలం కనిపిస్తే చాలు..  అది ప్రజల అవసరాల కోసం కేటాయించినదా లేక ప్రభుత్వానిదా అనే విచక్షణ లేకుండా కొందరు స్వార్థపరులు దానిపై కన్నేస్తున్నారు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు  ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నంలో ఓ పెద్ద ముఠానే బయటపడింది.

ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా పెద్ద ప్లానే వేసిందని చెప్పవచ్చు.  లేని దస్తా వేజులు సృష్టించి ఏకంగా..  రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా.. ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది. వాటినే లింకు డాక్యుమెంట్లుగా పేర్కొంటూ 43 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్టర్ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు తొలుత ఎకరం భూమితో ఈ ప్రయోగం చేసింది. ఇందులో కోర్టును కూడా తప్పుదోవ పట్టించి.. ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దానిని ఆసరాగా చేసుకొని 43 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ఈ భూమి చుట్టూ కంచె వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, మక్తా మహబూబ్పేట పరిధిలో సర్వే నంబరు 44లోని 43.13 ఎకరాల భూమిని అక్రమార్కులు ఆక్రమించారు. ఇందుకోసం చుట్టూ కంచె వేశారు. 1967 లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నకిలీ లింక్ డాక్యుమెంట్లు సృష్టించారు. లింకు డాక్యుమెంట్ ఆధారంగా ఈ ఏడాది ఒక ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధీని ఆసరాగా చేసుకొని మిగతా భూమిని కూడా తమ సొంతం చేసుకునెందుకు సంబంధిత అధికారులు కబ్జా దారులకు సహకరించారు. లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిన తేదీ 1967 ఫిబ్రవరి 12గా పేర్కొన్నారు. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో.. సెలవు రోజు రిజిస్ట్రేషన్ శాఖ ఎలా పని చేసిందన్న క్లూ దొరికింది. దీంతో ఇవన్నీ నకిలీ పత్రాలు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కబ్జాదారులకు సహకరించిన సబ్‌ రిజిస్ట్రార్‌ కె.మధుసూదన్‌ రెడ్డిని అధికారులు సస్పెండ్‌ చేశారు. మధుసూదన్‌ రెడ్డిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఆదేశించారు.

ALSO READ:గొర్రె, మేకల రక్తాన్ని తీసి.. ఆ మాఫియా గుట్టురట్టు

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×