E-Paper
Advertisement

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌

SummerSummer: మార్చి నెల మొదటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని తెలుగు రాష్ట్రాలపై చూపిస్తున్నాడు. తాజాగా భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి బయపడిపోతున్నారు. అయితే భానుడి ప్రతాపం మరికొన్ని రోజులు కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోనున్నాయని.. కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల అధికారులకు వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గతంలో కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వెల్లడించింది. పగటి సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరించింది.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×