E-Paper
Advertisement

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ..

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ..
Advertisement

IPS Transfers in Telangana: తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతుంది. శనివారం 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

నల్గొండ ఎస్పీగా ఉన్న చందనా దీప్తి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. తన స్థానంలోకి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ వచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీ సాయి చైతన్య బదిలీ అయ్యారు.

Advertisement

డీసీపీ రామగుండం గా విధులు నిర్వహిస్తోన్న అశోక్ కుమార్ జగిత్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. సన్‌ప్రీత్ సింగ్ సూర్యాపేట ఎస్పీగా, రాహుల్ హెగ్డే ట్రాఫిక్ డీసీపీగా, టీ శ్రీనివాస రావు జోగులాంబ గద్వాల ఎస్పీగా, డీ వీ శ్రీనివాస రావు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు.

మహబూబ్‌నగర్ ఎస్పీగా జానకి ధరావత్, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్, శంషాబాద్ డీసీపీగా రాజేశ్, మేడ్చల్ డీసీపీగా కోటిరెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్రనాయక్, మంచిర్యాల ఎస్పీగా భాస్కర్ బదిలీ అయ్యారు.

Advertisement

Also Read:  తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

డీసీపీ బాలనగర్‌గా సురేశ్ కుమార్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీగా హర్షవర్ధన్, వికారాబాద్ ఎస్పీగా నారాయణ రెడ్డి ఆదిలాబాదం కమాండెంట్‌గా నికితా పంత్ బదిలీ అయ్యారు.

ఛటర్జీ, ఎల్ సుబ్బరాయుడులను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×