E-Paper
Advertisement

Telangana : భూదేవికి బూరెలు.. భూకంపం రాకుండా పూజలు

Telangana : భూదేవికి బూరెలు.. భూకంపం రాకుండా పూజలు
Advertisement

Telangana : సంప్రదాయాలు, నమ్మకాలు భలే ఆసక్తిగా ఉంటాయి. వింతగా ఉన్నా వాటి వెనుక బోలెడంత విశ్వాసం ఉంటుంది. దశాబ్దాల తరబడి తమ పూర్వికులు పాటించిన ఆచారమే తమని కాపాడుతుందనే నమ్మకం ఇస్తుంది. ఇప్పటికీ అలాంటి సంఘటనలు అనేకం చూస్తూనే ఉంటాం. సమయానికి వానలు కురవక పోతే.. కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా చేస్తే వాన దేవుడు కరుణిస్తాడనే నమ్మకం. వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి చేస్తుంటారు. అవి మనల్ని చల్లగా చూస్తాయనే విశ్వాసం. ఇలాంటిదే మరో ఉదంతం ఇటీవల తెలంగాణలో జరిగింది. కాకపోతే అది కాస్త కొత్తగా ఉంది. ఇంతకుముందు అలాంటిది చూసిన సందర్భాలు తక్కువే. ఇంతకీ ఏం చేశారంటే..

భూమాతకు పూజలు..

Advertisement

ఇటీవల జగిత్యాల జిల్లాలో భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూకంపం వచ్చింది. తక్కువ తీవ్రతే కావడంతో అంతగా ప్రమాదమేమీ జరగలేదు. గోడలు, ఇంట్లోని వస్తువులు అదిరాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడిలా భూకంపం రావడంతో జిల్లా వాసులు బెదిరిపోయారు. భూమాతకు కోపం వచ్చిందని భావించిన కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ వాసులు.. భూదేవిని శాంతింపచేసేందుకు ప్రత్యేక పూజలు చేశారు. బూరెలు, భక్షాలు నైవేద్యంగా పెట్టి.. అమ్మా శాంతించమ్మా అంటూ భూమాతను వేడుకున్నారు.

బూరెలు, భక్షాలు నైవేద్యం..

Advertisement

పూర్వం కాలంలో ఎప్పుడో భూమి కంపిస్తే.. తమ పూర్వికులు ఇలానే చేశారని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. భూదేవికి బూరెలు అంటే చాలా ఇష్టమని.. అందుకే వాటిని నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తే అమ్మ శాంతిస్తుందని వారి నమ్మకం. గ్రామంలోని కొందరు మహిళలు బూరెలు చేసి.. గ్రామ శివారులో ఓ చెట్టు దగ్గర మట్టి తవ్వి చిన్న గుంత చేశారు. ఆ గుంతలో ముగ్గు చేసి, పసుపు కుంకుమ చల్లి.. దానిపై బూరెలు, భక్షాలు ఉంచి.. నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించి.. ఆ గుంతతో కొన్ని బూరెలు వేసి మట్టితో కప్పేశారు. గోతిలో పెట్టి పూడ్చగా మిగిలిన వాటిని ప్రసాదంగా స్వీకరించారు గ్రామస్తులు. మరోసారి భూకంపం రావద్దని భూమాతను వేడుకున్నామని చెబుతున్నారు. ఎవరి నమ్మకం వాళ్లది. భూదేవికి బూరెలు నైవేద్యంగా సమర్పించి.. మట్టిలో పాతిపెట్టడం మాత్రం కాస్త కొత్తగానే ఉందంటూ జిల్లా వ్యాప్తంగా ఈ సంప్రదాయం చర్చనీయాంశమైంది.

Also Read : భర్త లేని వారు బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే..

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×