Big Stories

NTR Jayanthi: ఎన్టీఆర్‌ 101వ జయంతి.. నివాళులు అర్పించిన తారక్‌, కళ్యాణ్‌రామ్‌!

Jr NTR and Kalyan Ram Pays Tribute to Sr NTR: ఆంధ్రుల ఆరాధ్య నటుడు, దివంగత మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న మనవళ్లు ఇద్దరు ఎన్టీఆర్ సమాధి వద్ద ప్రార్ధనలు చేశారు. ఇక తమ తాతను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -
టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఓ వ్యక్తి కాదు శక్తి అని ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తన సోదరుడు రామకృష్ణతో కలిసి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు..

ఎన్టీఆర్ జయంతికి టీడీపీ ఏర్పాట్లు..

- Advertisement -

వెండి తెర ఆరాధ్య నాయకుడు.. జనం మెచ్చిన నాయకుడు.. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు అండదండగా ఉండేందుకు మొదటి సారి భారత దేశంలోనే ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మహానాయుకుడు మన ఎన్టీఆర్. అందులో ముఖ్యంగా తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇళ్లు ఉండాలన్న ఆలోచన చేసిన గొప్ప మహానాయకుడు.

Also Read: Gangs Of Godavari Pre Release Event: మా మోక్షు వస్తున్నాడు.. మీ ముగ్గురే వాడికి ఇన్స్పిరేషన్: బాలయ్య బాబు స్పీచ్ వేరే లెవెల్

అలాంటి నాయకుడు 101 జన్మదిన వేడుకను నిర్వహించేందుకు తేదాపా ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల కోడ్ తరుణంలో అన్ని పార్టీనాయకుల విగ్రహాలకు యంత్రాంగం ముసుగులు వేశారు, అలాగే ఎక్కడ కూడా సభలు, కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎన్నికల కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో తేదాపా పార్టీ నాయికులు ఎన్టీఆర్ చిత్రపటాలు ఏర్పాటు చేసి సభను నిర్వహించేందుకు తేదేపా శ్రేణులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News