Telangana Assembly Session: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. అసెంబ్లీలో తొలిసారి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూబ్లిహిల్స్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కృష్ణానగర్ వరద సమస్యను, ప్రమాదకరమైన హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారు. ఈ ధీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఊరటనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు.. జనవరి 2వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన సభలో పలు కీలక అంశాలపై చర్చ జరిగిన అనంతరం, తదుపరి సమావేశాలను వచ్చే ఏడాది ఏడాది జనవరి రెండవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో నేటి సభా కార్యక్రమాలు ముగిశాయి.