E-Paper
Advertisement

Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

Kaleshwaram Project Engineers: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో భాగంగా మంగళవారం కమిషన్ ఎదుట కాళేశ్వరం ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఏజెన్సీలకు రూ. 1,600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీలను ఏజెన్సీలకు ఇచ్చేముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా? అంటూ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది.

Also Read: సామాన్యులకు బిగ్ షాక్.. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు.. ఎంతంటే?

ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే విడుదల చేసినట్టు వారు పేర్కొన్నారు. ఆనకట్టల వద్ద డ్యామేజ్ కు గల కారణాల గురించి వారిని కమిషన్ అడిగి తెలుసుకుంది. అనుకున్నదానికంటే ఎక్కువగా వరద రావడం వల్లే సీసీ బ్లాక్ లు దెబ్బతిన్నట్లు ఇంజినీర్లు కమిషన్ కు తెలియజేశారు. 2022 జులైలో వచ్చిన భారీ వరదల కారణంగా సీసీ బ్లాక్ లు దెబ్బతిన్నాయని, డ్యామేజీ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కూడా వారు కమిషన్ కు తెలియజేశారు.

డిజైన్లు, డ్రాయింగ్ లను గురించి కూడా కమిషన్ వారిని ప్రశ్నించింది. దీంతో వారు సమాధానమిస్తూ వ్యాప్కోస్ సంస్థ తయారు చేసిందంటూ కమిషన్ కు సమాధానమిచ్చారు. సీడీఓ సీఈ అనుమతితో అమలు చేసినట్టు వారు పేర్కొన్నారు. నిర్మాణానికి ముందు సైట్లలో ఏమైనా పరీక్షలు నిర్వహించారా? అని వారిని కమిషన్ ప్రశ్నించగా ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయని ఇంజినీర్లు వివరణ ఇచ్చారు.

Also Read: పేదలపైనా మీ ప్రతాపం ?.. హైడ్రాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×