BigTV English
Advertisement

Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

Kaleshwaram Project Engineers: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో భాగంగా మంగళవారం కమిషన్ ఎదుట కాళేశ్వరం ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఏజెన్సీలకు రూ. 1,600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీలను ఏజెన్సీలకు ఇచ్చేముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా? అంటూ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది.


Also Read: సామాన్యులకు బిగ్ షాక్.. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు.. ఎంతంటే?

ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే విడుదల చేసినట్టు వారు పేర్కొన్నారు. ఆనకట్టల వద్ద డ్యామేజ్ కు గల కారణాల గురించి వారిని కమిషన్ అడిగి తెలుసుకుంది. అనుకున్నదానికంటే ఎక్కువగా వరద రావడం వల్లే సీసీ బ్లాక్ లు దెబ్బతిన్నట్లు ఇంజినీర్లు కమిషన్ కు తెలియజేశారు. 2022 జులైలో వచ్చిన భారీ వరదల కారణంగా సీసీ బ్లాక్ లు దెబ్బతిన్నాయని, డ్యామేజీ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కూడా వారు కమిషన్ కు తెలియజేశారు.


డిజైన్లు, డ్రాయింగ్ లను గురించి కూడా కమిషన్ వారిని ప్రశ్నించింది. దీంతో వారు సమాధానమిస్తూ వ్యాప్కోస్ సంస్థ తయారు చేసిందంటూ కమిషన్ కు సమాధానమిచ్చారు. సీడీఓ సీఈ అనుమతితో అమలు చేసినట్టు వారు పేర్కొన్నారు. నిర్మాణానికి ముందు సైట్లలో ఏమైనా పరీక్షలు నిర్వహించారా? అని వారిని కమిషన్ ప్రశ్నించగా ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయని ఇంజినీర్లు వివరణ ఇచ్చారు.

Also Read: పేదలపైనా మీ ప్రతాపం ?.. హైడ్రాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Related News

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

Big Stories

×