E-Paper
Advertisement

Kamareddy News: కుక్కల మరణాల కేసు వేళ సర్పంచ్‌కు మరో షాక్.. కొండముచ్చుల నిర్బంధంపై ఫారెస్ట్ అధికారుల సీరియస్!

Kamareddy News: కుక్కల మరణాల కేసు వేళ సర్పంచ్‌కు మరో షాక్.. కొండముచ్చుల నిర్బంధంపై ఫారెస్ట్ అధికారుల సీరియస్!

Kamareddy News: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో వీధి కుక్కలపై విష ప్రయోగం జరిగిన ఘటన మరవకముందే, సర్పంచ్ శేఖర్ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా రెండు కొండముచ్చులను బంధించిన వ్యవహారంలో ఆయనపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

పాల్వంచ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ శేఖర్, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా రెండు కొండముచ్చులను పట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోని ఒక పంజరంలో బంధించారు. ఈ విషయం జంతు ప్రేమికుడు గౌతమ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

వన్యప్రాణులను అలా నిర్బంధించడం చట్టరీత్యా నేరమని, ఇది జంతు హింస కిందకు వస్తుందని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని సర్పంచ్ శేఖర్‌ను వివరణ కోరారు. వన్యప్రాణులను బంధించడంపై ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

అటవీ శాఖ అధికారుల సమక్షంలో పంజరంలో ఉన్న రెండు కొండముచ్చులను విడిపించి, వాటిని సురక్షితంగా సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. ఇప్పటికే వీధి కుక్కల మరణాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్, ఇప్పుడు వన్యప్రాణుల నిర్బంధం కేసులో కూడా చిక్కుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Read Also: మహిళా IAS వ్యవహారంలో బీఆర్ఎస్ కుట్ర.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×