E-Paper
Advertisement

Bandi Sanjay: బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకుంటే మరో యుద్దం తప్పదు.. బండి సంజయ్ వార్నింగ్!

Bandi Sanjay: బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకుంటే మరో యుద్దం తప్పదు.. బండి సంజయ్ వార్నింగ్!
Advertisement

Bandi Sanjay: కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకోవాలని చూస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ మేయర్ అవ్వకూడదని కరీంనగర్ లో ఈ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. బీజేపీ మేయర్ అవ్వడాన్ని అడ్డుకోవాలని చూస్తే వారి బతుకులను బర్ బాద్ చేస్తానని బండి వార్నింగ్ ఇచ్చారు. వారి రాజకీయాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉంటే ఆయన నుంచే తన యుద్ధం మొదలుపెడతానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై లక్షల మందిని రోడ్డెక్కించి సీఎంను నిలదీస్తానని స్పష్టంచేశారు. ఎవరేం చేసినా కరీంనగర్ మేయర్ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

లోకల్ నేతలు మాట్లాడుకున్నారా?

కాంగ్రెస్(CONGRESS), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM).., మూడు పార్టీలకు కలిపినా వారికి ఉన్న సంఖ్యతో ఎలా మేయర్ అవుతారని బండి ప్రశ్నించారు. తమ పార్టీ నేతలకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని, అయితే.. బీజేపీ నేతలు వాళ్లను ఛీకొడుతున్నారన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాలనే నిర్ణయంపై లోకల్ నేతలు మాట్లాడుకున్నారా? లేక అధిష్టానాలు మాట్లాడుకున్నాయా? అనేది ప్రజలకు తెలియాలని సంజయ్ వ్యాఖ్​యానించారు. కరీంనగర్ అభ్యర్థుల ఎంపిక సైతం రెండు పార్టీల్లో లోపాయికార ఒప్పందంతో జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, వీళ్ల బండారం, కుట్ర కరీంనగర్ తో బయట పడబోతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వి రహస్య చర్చలు కాదని, బహిరంగంగానే చర్చలు జరుపుతున్నారన్నారు. సీఎం ఫోన్ కాల్ చేశారని సాక్షాత్తు లోకల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్పొరేటర్ల చెబుతున్నారని సమాచారం ఉందన్నారు.

Advertisement

Also Read: Anchor Ravi: మేము అటు స్టార్స్ కాదు.. ఇటు నార్మల్ పబ్లిక్ కాదు. మధ్యలో ఉన్నాం

తిండి, నిద్ర మాని తీవ్రంగా కష్టపడ్డాం

కరీంనగర్ లతో ఎంఐఎంను 8 స్థానల నుంచి 3 సీట్లకు పరిమితం చేశామని బండి చెప్పారు. పెన్షనర్లతో పాటు హామీల బాధితులందరితో తాను మాట్లాడుతున్నానని, కరీంనగర్ నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సెగ తగిలిస్తానని బండి సవాల్ చేవారు. ఈ రెండు పార్టీలకు దాన్ని తట్టుకునే దమ్ముందా? అని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లా చిల్లర రాజకీయాలు చేయబోనని, వారు చేస్తే కూడా ఊరుకోబోనని స్పష్​టంచేశారు. తాము తిండి, నిద్ర మాని తీవ్రంగా కష్టపడ్డామని బండి వ్యాఖ్యానించారు. కానీ మైండ్ లేనోడు.. మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా పరిస్థితి మారిందని ఎద్దేవాచేశారు. ఒక్క మేయర్ పీఠం కోసం ఇంతలా దిగజారలా? అని ప్రశ్నించారు. తాము ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని, తమ ఓటింగ్ శాతం గతం కంటే భారీగా పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా బలపడతామని, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Also Read: Manasa Varanasi : మిస్ ఇండియా మానస సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఇదే..?

Related News

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Big Stories

Advertisement
×