Vande Bharat Express Snake: గత ఏడాది డిసెంబర్ 27న ముంబై నుండి సోలాపూర్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ (నం. 22225) లోని C-16 కోచ్ టాయిలెట్లో దాదాపు రెండున్నర అడుగుల పొడవున్న పాము కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, కర్జాత్, పూణే స్టేషన్లలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అది దొరకకపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ టాయిలెట్ను సీల్ చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు సోలాపూర్ స్టేషన్కు చేరుకోగానే స్నేక్ క్యాచర్ సహాయంతో ఆ పామును సురక్షితంగా బయటకు తీశారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన ఆర్పీఎఫ్ అధికారులు, ఈ పని చేసిన నిందితుడిని ఫిబ్రవరి 12న ముంబ్రాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని నాసిక్ జిల్లాకు చెందిన జగన్ అర్జున్ భాలేగా గుర్తించారు. డిసెంబర్ 27, 2025న జరిగిన ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఏడు వారాల తర్వాత ముంబ్రాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులకు థానే స్టేషన్లో నిందితుడు ఒక సంచిలో పామును తీసుకువచ్చి టాయిలెట్లో వదిలివేసి కిందకు దిగిపోతున్న దృశ్యాలు కనిపించాయి. సాంకేతిక ఆధారాలు, ఇన్ఫార్మర్ల సమాచారంతో ఫిబ్రవరి 12న ఆర్పీఎఫ్ బృందం ముంబ్రాలో జగన్ అర్జున్ భాలేను పట్టుకుంది. విచారణలో కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, అలజడి సృష్టించడానికే తాను ఈ పని చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
నిందితుడిపై రైల్వే చట్టంలోని సెక్షన్లు 145(బి), 147 మరియు 153 కింద కేసులు నమోదు చేశారు. కళ్యాణ్లోని రైల్వే కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న వందే భారత్ రైలులో ఇలాంటి ఘటన జరగడంపై రైల్వే అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
A 37-year-old man has been arrested for allegedly planting a live Indian rat snake inside the toilet of a Mumbai–Solapur Vande Bharat Express coach on December 27, 2025. The 2.5-foot-long non-venomous snake caused panic among passengers before being rescued at Solapur. CCTV… pic.twitter.com/c8A5ydif3F
— Mid Day (@mid_day) February 14, 2026
Read Also: Snakes Den: ఒకేచోట భూమి నుంచి వచ్చే లక్ష పాములు.. వాటిని చూసేందుకు వచ్చే పర్యాటకులు