E-Paper
Advertisement

Kavitha : ఢిల్లీలో కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం ఆగదని హెచ్చరిక..

Kavitha : ఢిల్లీలో కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం ఆగదని హెచ్చరిక..
Advertisement

Kavitha : ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సీతారాం ఏచూరి, తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొనన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో ఈ దీక్షను చేపట్టారు.

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలని ఆమె స్పష్టం చేశారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్ద పీట వేశారని అమ్మానాన్న అంటాం.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుందని వివరించారు.

Advertisement

రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని కవిత అన్నారు. 1996లో అప్పటి ప్రధాని దేవగౌడ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినా ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని.. ఈ బిల్లుపై అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు.

కవిత చేపట్టిన దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కవిత దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. వారంతా కవితతో కలిసి దీక్షలో పాల్గొన్నారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×