BigTV English
Advertisement

KCR Comments on PM Modi: పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేసీఆర్

KCR Comments on PM Modi: పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేసీఆర్

PM Modi Black Mailing in the Name of Pakistan Said by KCR in Dundigal Road Show: ప్రధాని మోదీపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయన నర్సాపూర్, పటాన్ చెరు, దుండిగల్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పుష్కలంగా మంచినీటి సరఫరా చేశామన్నారు. అదేవిధంగా విద్యుత్ కు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్య్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాని మోదీయే చెబుతున్నారన్నారు.


రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు 12 మంది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అదేవిధంగా మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ పక్కాగా కైవసం చేసుకోబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటు బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కేజ్రీవాల్, కవితలను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారన్నారు. వారి అరెస్ట్ లపై అమెరికా కూడా నిరసన వ్యక్తం చేసిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశ్వగురనని ప్రచారం చేసుకునే ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారన్నారు. పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు ఇస్తే.. అందులో ఒక్కటి కూడా అమలు చేసి చూపించలేదన్నారు. మోదీ ప్రభుత్వ పనితీరు వల్ల దేశంలో ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగాయన్నారు. విదేశీ మారక విలువ పడిపోయిందన్నారు. డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ రూ. 84 కు పడిపోయిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: మాట ఇస్తే తల తెగి కింద పడ్డా వెనక్కి తిరిగి చూడను: సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ప్రజలారా జాగ్రత్తగా గమనించాలంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రకు కట్టబెట్టారంటూ మోదీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా గోదావరి, కృష్ణా జలాలను కర్ణాటక, తమిళనాడుకు తరలిస్తామని అంటున్నారని.. ఆ జలాలు తెలంగాణకు దక్కాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండంటూ ఆయన ప్రజలను కోరారు.

కాగా, నిజామాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. పీఎం మోదీ, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఒకటే.. అందుకే కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని రేవంత్ పేర్కొన్న విషయం విధితమే. కేంద్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకవచ్చేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని ఆయన పేర్కొన్న విషయం కూడా విధితమే.

Related News

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

Big Stories

×