E-Paper
Advertisement

తెలంగాణలో మళ్లీ గులాబీ జైత్రయాత్ర.. వంద శాతం మనమే గెలవబోతున్నాం: కేసీఆర్

తెలంగాణలో మళ్లీ గులాబీ జైత్రయాత్ర.. వంద శాతం మనమే గెలవబోతున్నాం: కేసీఆర్

KCR Jagtial Speech: జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న అణచివేతను.. మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా, ఆయనను వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డపై మళ్లీ వంద శాతం బీఆర్ఎస్ హవా మొదలుకాబోతోందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియ‌ర్ నేత‌ జీవ‌న్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “జగిత్యాలకు చెందిన కవి కలిశెట్టి ప్రభాకర్ ఒక మాట అన్నాడు. చీకట్లో భయపడితే ఒక చెట్టే నీ చుట్టూ అరణ్యమై భయపెడుతుంది.. అదే గుండె ధైర్యం ఉంటే, నీ వెంట ఒక పెద్ద సైన్యమే నిలుస్తుంది. ఈరోజు నా కళ్లముందు ఉన్న ఈ జనసందోహం, బయట రోడ్ల మీద ఉన్న జీవన్ రెడ్డి గారి అభిమానులు చూస్తుంటే ఆ మాట నిజమనిపిస్తుంది. జీవన్ రెడ్డి గారు నిఖార్సైన మనిషి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మొండి ధైర్యం ఉన్నోడు. అందుకే తెలంగాణ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మాది 45 ఏళ్ల స్నేహం. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా మా మిత్రత్వంలో ఏనాడూ లోపం లేదు.” అని కేసీఆర్ అన్నారు.

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ఆకలి కేకలతో, వలసలతో అల్లాడిపోయేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరీంనగర్, పాలమూరు జిల్లాల నుండి 90 శాతం మంది ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లేవారని, అప్పటి ప్రభుత్వాలు ప్రజల ఆకలి తీర్చలేక గంజి కేంద్రాలు నడిపేవారని గుర్తు చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రైతులు గళమెత్తారని, బషీర్‌బాగ్ వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు రైతులు చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయంగా తెగించి ముందుకు సాగానని వివరించారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన 14ఎఫ్ జీవో (14F GO) తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉందని, ఆ సమయంలోనే తాను ‘చావో రేవో’ తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. శపథం చేసి తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షే కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిందని, చివరకు అప్పటి హోంమంత్రి చిదంబరం నోట “తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది” అనే చారిత్రాత్మక ప్రకటన వచ్చేలా చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు మళ్లీ క్షేత్రస్థాయిలోకి వస్తున్నానని, ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×