E-Paper
Advertisement

KCR : దుబ్బాక అభ్యర్థిపై దాడి.. కేసీఆర్ వార్నింగ్ ఇదే..

KCR : దుబ్బాక అభ్యర్థిపై దాడి.. కేసీఆర్ వార్నింగ్ ఇదే..
Advertisement

KCR : మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. తొలుత మంత్రి హరీశ్‌ రావుకు ఫోన్‌ చేసి ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తర్వాత బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కే ఈ ఘటనపై కేసీఆర్ మాట్లాడారు. మనం సమస్యలపై యుద్ధం చేస్తున్నామన్నారు. కానీ ప్రతిపక్షాలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయని ఆరోపించారు. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పిందని వెల్లడించారు.

ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ఈ చర్యలకు దిగుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కత్తితో తమ అభ్యర్థిపై దాడి చేశారని.. ఈ ఘటనపై తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి.

Advertisement

తెలంగాణలో గత పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయని ఎప్పుడూ ఎవరూ కూడా హింసకు దిగలేదని కేసీఆర్ అన్నారు. ప్రజలు గెలిపిస్తే గెలిచామన్నారు. వీలైనంత ప్రజలకు సేవ చేశామని తెలిపారు. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదన్నారు.

సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డిపై దాడి తనపై జరిగనట్లే భావిస్తానని అన్నారు. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇది రాజకీయమా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×