E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్‌కి బిగ్ డే.. మంచి రోజులు రాబోతున్నాయ్: రేవంత్

Congress: కాంగ్రెస్‌కి బిగ్ డే.. మంచి రోజులు రాబోతున్నాయ్: రేవంత్
congress

Congress News Telangana(ts politics): తెలంగాణకి మంచి రోజులు రాబోతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా చేరికలు ఉంటాయన్నారు. ఈ చేరికలు సాధారణమైనవి కావని.. సమిష్టి పోరాటంతో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసువస్తామన్నారు.

రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బిగ్ డే. ఉదయం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికెళ్లారు రేవంత్. మనం మనం కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చర్చించుకున్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికెళ్లారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అక్కడే అంతా కలిసి లంచ్ మీటింగ్ నిర్వహించారు.

అటునుంచి రేవంత్, కోమటిరెడ్డిలు కలిసి.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటికెళ్లారు. ఆయన్ను కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. కేసీఆర్, బీఆర్ఎస్‌పై పోరాటానికి కాంగ్రెస్సే సరైన వేదికని వివరించారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పొంగులేటి అంగీకరించారు.

రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి, జూపల్లి.. బలమైన నాయకుల అరుదైన కలయికతో.. కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైంది. ఇదే జోష్‌తో ముందుముందు మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తోంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ.. హస్తం పార్టీతో చేతులు కలిపేందుకు ముందడుగు వేస్తున్నాయి.

అయితే, నల్గొండ జిల్లా చేరికలే కీలకంగా మారనున్నాయి. వేముల వీరేశం తదితరులు పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, కొందరి విషయంలో.. కొందరు సీనియర్లు అభ్యంతరం చెబుతున్నట్టు తెలుస్తోంది. చేరికల విషయంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు రేవంత్ రెడ్డి. నల్గొండలో చేరికల విషయంలో కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌తో చర్చించిన తర్వాతే పార్టీలోకి చేరుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×