E-Paper
Advertisement

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

Khammam : అమెరికాలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజారా కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు సాయి రాజీవ్ రెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సాయి రాజీవ్ రెడ్డి ఓ పార్శిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ట్రక్ అదుపు తప్పి రాజీవ్ కార్ ని బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన సాయి రాజీవ్.. చికిత్స పొందుతూ అదే రోజున మరణించాడు.

మృతుడి సోదరి సైతం టెక్సాస్ లో ఉద్యోగం చేస్తుంది. తన తల్లి తండ్రులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తండ్రి అమెరికాకి పయనమై వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×