E-Paper
Advertisement

Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ.. సమస్యకు పుల్‌స్టాప్ పడేనా..?

Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ.. సమస్యకు పుల్‌స్టాప్ పడేనా..?

Konda Surekha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఇటీవల తమ కుటుంబం చుట్టూ జరిగిన ‘హైడ్రామా’ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

ఓఎస్డీ తొలగింపు చుట్టూ హైడ్రామా

కొన్ని రోజుల క్రితం, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తొలగించబడిన ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులు మఫ్టీలో మంత్రి నివాసానికి చేరుకోవడంతో ఈ ఉద్రిక్తత మొదలైంది.

పోలీసులు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసుల చర్యను ఆమె తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా సుస్మిత మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.

కుట్ర కోణంపై కొండా సుస్మిత సంచలన ఆరోపణలు

పోలీసుల చర్యపై స్పందించిన కొండా సుస్మిత పటేల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక మంత్రులు, నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

‘బీసీ వర్గానికి చెందిన నా తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. రెడ్లందరూ కలిసి మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు’  అని సుస్మిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగింది.

సీఎంకు వివరణ ఇచ్చిన కొండా దంపతులు

ఈ నేపథ్యంలోనే, మంత్రి సురేఖ దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపైనా, ఓఎస్డీ తొలగింపు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపైనా కొండా దంపతులు సీఎంకు పూర్తిస్థాయిలో వివరణ ఇస్తున్నట్లు సమాచారం.

కొండా సుస్మిత ఆరోపణలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు కావని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు ఎలాంటి ఉద్దేశం లేదని, పార్టీ ముఖ్యమంత్రి పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని వారు సీఎంకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, మఫ్టీలో వచ్చిన పోలీసుల వ్యవహారంపై తమకున్న ఆందోళనలను, భద్రతాపరమైన ఇబ్బందులను కూడా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

కొండా దంపతుల వివరణ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందించారనే దానిపై స్పష్టత లేదు. అయితే, మంత్రి కుటుంబం నుండి బహిరంగంగా వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే తదుపరి చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయి.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×