E-Paper
Advertisement

కాంగ్రెస్‌కు పెట్రో రేట్లపై మాట్లాడే అర్హత లేదు.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌కు పెట్రో రేట్లపై మాట్లాడే అర్హత లేదు.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు
Advertisement

Vishweshwar Reddy: స్వేచ్ఛ బ్యూరో: పెట్రోల్, డీజిల్ రేట్లపై మాట్లాడేందుకు కాంగ్రెస్ కు ఏం హక్కు ఉందని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ యుద్ధం జరిగితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ముందుగానే చెప్పారని గుర్తుచేశారు. విదేశాలతో పోల్చితే మన దగ్గర తక్కువగానే పెరిగిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో రూ.5 లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ అమ్మిందని, బీజేపీ వచ్చిన తరువాత ఆ అప్పులను బీజేపీ తీర్చిందన్నారు. ఒకవైపు పెట్రో రేట్లే కాకుండా ఆ బాండ్స్ కూడా రీ పే చేస్తోందని వెల్లడించారు. వడ్డీతో సహా మోడీ ప్రభుత్వమే వాటిని చెల్లింస్తోందని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పాపాలన్నీ బీజేపీ కడుగుతోందన్నారు. తెలంగాణలో పాత సీఎంతో పాటు కొత్త సీఎం కూడా పెంచారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ ధర తెలంగాణలో ఉందని కొండా పేర్కొన్నారు.

Advertisement

మహారాష్ట్రలో రూ.109 ఉంటే, గుజరాత్ రూ.98.30, ఢిల్లీలో రూ.97, తెలంగాణ లో రూ.111.88గా ఉందన్నారు. ఇక డీజిల్ రేట్లు మహారాష్ట్రలో రూ.94.95 ఉండగా, గుజరాత్ లో రూ.93.44, ఢిల్లీలో రూ.91.95, తెలంగాణ లో రూ.99.88గా ఉందన్నారు. పెట్రోల్ దొరికే దేశాల్లో పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయని, కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో రేట్లు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా భారత్ కంటే పెట్రోల్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

Also Read: వివక్షపై వినూత్న నిరసన.. గుండు గీయించుకున్న బీజేపీ మహిళా కౌన్సిలర్!

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×